తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మునీరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాలనను తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని, బీఆర్ఎస్ అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఐదు ప్రధానాంశాలతో కూడిన ‘పాంచజన్యం’ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో ఉచిత విద్య, వైద్యం, ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాల భర్తీ, వ్యవసాయాభివృద్ధి వంటి కీలక హామీలు ఇచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.
![]()




