తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆత్మగౌరవం, అభివృద్ధి లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్న కవిత, వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పార్టీ విధివిధానాలను వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
![]()




