📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,291  |  485 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Telangana ⚡ AMP

తెలంగాణలో అమలులోకి ఎస్సీ వర్గీకరణ చట్టం : 56 కులాలకు మూడు గ్రూపులుగా రిజర్వేషన్లు

April 14, 2025 April 14, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ ప్రభుత్వం బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించింది.

గ్రూపుల వారీగా రిజర్వేషన్లు:

  • గ్రూప్ A: సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్.
  • గ్రూప్ B: మాదిగ మరియు దాని ఉపకులాలైన 18 కులాలకు 9% రిజర్వేషన్.
  • గ్రూప్ C: మాల మరియు దాని ఉపకులాలైన 26 కులాలకు 5% రిజర్వేషన్.

ఈ వర్గీకరణ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో మొదట గ్రూప్ A, తరువాత గ్రూప్ B, చివరగా గ్రూప్ C కులాల అభ్యర్థులతో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపుకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు కేటాయించబడ్డాయి.

జనాభా గణాంకాల ఆధారంగా వర్గీకరణ:

ప్రస్తుతం గ్రూప్ Aలో 1,71,625 మంది, గ్రూప్ Bలో 32,74,377 మంది, గ్రూప్ Cలో 17,71,682 మంది ఉన్నారు. 2026 జనాభా లెక్కలు పూర్తైన తర్వాత, ఈ వర్గీకరణను జనాభా గణాంకాల ఆధారంగా పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గెజిట్‌ తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో విడుదల చేయబడింది. ఈ చర్యతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వివాదాలకు ముగింపు పలకాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-A లోని కులాల వారితో, అక్కడ మిగిలితే గ్రూప్-B, ఆ తర్వాత గ్రూప్-C లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.
రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..
గ్రూప్-A లోని వారికి 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్-B లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87,97, గ్రూప్-C లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు ఉంటాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!