📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 485,802  |  452 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిLatest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతి
Khammam ⚡ AMP

భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

July 1, 2024 July 1, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ BTPS లో యూనిట్‌ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ థర్మల్‌ డైరెక్టర్‌ లక్ష్మయ్య, విద్యుత్‌ సౌధా ఎస్‌ఈ రత్నాకర్‌లు ఆదివారం బీటీపీఎస్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం డైరెక్టర్‌ లక్ష్మయ్య విలేకరులతో మాట్లాడుతూ..పిడుగుపాటు ప్రభావం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ పిడుగు పడినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో గుర్తించామని అన్నారు. దీనివల్ల రూ.20 కోట్ల రూ.25 కోట్ల వరకూ నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదం వల్ల యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తికి పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందన్నారు. కాలిపోయిన జనరేటర్‌, యంత్ర సామగ్రి లభ్యత ఆధారంగా మాత్రమే ఈ యూనిట్‌ పునరుద్ధరణ అంశంలో స్పష్టత వస్తుందని తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!