ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని ఒక కోల్డ్ స్టోరేజ్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40 వేల క్వింటాళ్ల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ. 5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా కష్టపడి పండించిన పంట కళ్లముందే బూడిద కావడంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
![]()




