కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనల ప్రకారం విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఇటీవల ముంబయిలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కల్యాణ్కు ఈ శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే.
![]()




