గుజరాత్లోని అహ్మదాబాద్ నగర శివారు రామోల్ ప్రాంతంలో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. లైసెన్స్ రద్దయినప్పటికీ ఈ ఫ్యాక్టరీలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
![]()




