వచ్చే ఎన్నికల్లో పదవులు, టికెట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పార్టీ క్లస్టర్ ఇంచార్జులతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపికపై నిరంతరం సర్వేలు చేస్తున్నామని, తప్పులు చేసిన వారిని ఖచ్చితంగా పక్కన పెడతామని స్పష్టం చేశారు. కార్యకర్తలను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే, డీఎస్సీపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టడంతో ఆ ‘గొడ్డలి పార్టీ’ ఖంగుతిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
![]()




