ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని కుర్దా రోడ్ డివిజన్ పరిధిలో ఉన్న పలాస నుండి ఇచ్ఛాపురం వరకు గల ఏడు కీలక రైల్వే స్టేషన్లను విశాఖపట్నం డివిజన్కు బదిలీ చేస్తూ రైల్వే శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలాస, సోంపేట, ఇచ్ఛాపురం వంటి స్టేషన్ల చేరికపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2019 నుండి పెండింగ్లో ఉన్న ఈ చిరకాల డిమాండ్ నెరవేరడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని స్పష్టం చేశారు.
![]()



