ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేయగా, చైర్మన్ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహూకరించారు. ఏపీ పర్యటనలో భాగంగా ఆయన శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![]()




