తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌ కొత్తగూడెం జిల్లా రామవరంలో విజయవంతంగా ముగిసింది. అథ్లెటిక్స్‌లో పాల్గొన్న పిల్లలకు డివైఎస్‌వో పరంధామరెడ్డి, ఐఎన్టీయూసి వైస్‌ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎంఎంటీఐ సీఐ సుధాకర్ రావు ప్రధాన అతిథులుగా హాజరై టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ క్యాంప్‌ను కోచ్ రియాజ్ పాష ఆధ్వర్యంలో నిర్వహించగా, రామవరం వ్యాపారులు నజీర్, జాకీర్, సుభాష్‌ టీషర్టుల స్పాన్సర్‌గా నిలిచారు. జిల్లాలో గ్రామీణ స్థాయిలో మరిన్ని పిల్లలు అథ్లెటిక్స్‌లో పాల్గొనడం సంతోషకరమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సంఘాల నాయకులు, ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోచ్ మల్లికార్జున్, రియాజ్ పాష కృషిని కొనియాడుతూ వారిని అభినందించారు.

Loading

By admin

error: Content is protected !!