Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Khammam

ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో సేవాలాల్ సేన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ నాయక్ భారత రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అవసరం అంటూ అన్నారు. గిరిజనుల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలలో […]

Loading

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో సేవాలాల్ సేన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సురేష్ నాయక్ భారత రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అవసరం అంటూ అన్నారు. గిరిజనుల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలలో కోత పడుతున్నప్పుడు, ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.

ఆయన ఇంకా, గిరిజన యువత ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నదని, ఈ పరిస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిందని తెలిపారు. దశాబ్దాలుగా గిరిజన హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని, సేవాలాల్ సేన ఈ విషయంపై పోరాటాన్ని మరింత వేగంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రతినిధులు బానోతు నాగరాజు నాయక్, కిషన్ నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!