📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,537,891  |  277 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam ⚡ AMP

విద్యార్థుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: కోట శివశంకర్

December 9, 2024 December 9, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram
  • తెలంగాణ విద్యార్థుల సమస్యలపై భద్రాద్రి కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై భారీ ధర్నా జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ నేతృత్వంలో విద్యార్థులు పాకెట్ మనీ, బుక్ బ్యాంకు, మెస్ చార్జీల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ప్రధాన డిమాండ్లు:

  1. పాకెట్ మనీ విడుదల: గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రూ.500 పాకెట్ మనీని విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
  2. బుక్ బ్యాంకు అందించాలి: ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాలను త్వరగా అందించాలని డిమాండ్ చేశారు.
  3. పౌష్టిక ఆహారం: మెస్ ఛార్జీలను పెంచిన మేరకు పౌష్టిక ఆహారం, రుచికరమైన మెనూ అందించాలని సూచించారు.
  4. వేడి నీళ్లు, స్వెటర్లు: చలికాలంలో హాస్టల్ విద్యార్థులకు అవసరమైన వేడి నీళ్లు, స్వెటర్లు అందించాలని కోరారు.

కోట శివశంకర్ మాట్లాడుతూ:
“ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పాకెట్ మనీ కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బుక్ బ్యాంకు అందించడం లేదు. హాస్టల్స్‌లో పౌష్టిక ఆహారం అందించకపోవడం విచారకరం. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతమవుతాయి,” అని ఆయన హెచ్చరించారు. దీంతో పాటు విద్యార్థుల ప్రతినిధులు జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!