📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 485,397  |  447 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిLatest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతి
Khammam ⚡ AMP

కార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం :ఐ.ఎన్.టి.యు.సి

December 1, 2024 December 1, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్* కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఐ.ఎన్.టియు.సి యూనియన్ కృషి చేస్తుంది అని తెలియజేస్తూ కార్మికుల అనుమతి మేరకే ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టామని , కల్లబొల్లి మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి ఏ.ఐ.టీ.యూ.సీ యూనియన్ ఇప్పటికైనా కార్మికుల పక్షాన ఉండాలని , కార్మికుల కోసం పనిచేయాలని కార్మికుల పక్షాన పని చేసేటటువంటి ఐఎన్టీయూసీ యూనియన్ పై విమర్శలు మానుకొని కార్మికుల కోసం , కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలని కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ తెలియజేశారు. ఇటీవల జరిగినటువంటి కార్పొరేట్ స్ట్రక్చర్ మీటింగ్ లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ నాయకులు ఏ ఒక్క హక్కును కూడా పూర్తిస్థాయిలో యాజమాన్యాన్ని ఒప్పించకపోవడంపై కార్మిక వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు అని తెలియజేశారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినటువంటి ఏఐటియుసి యూనియన్ స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికులు సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సొంత ఇంటి కాల , మారు పేర్లు గాని , సూటబుల్ జాబ్ , ఓవర్ మెన్స్ , సూపర్వైజర్ స్టాప్ , ఈపి ఆపరేటర్స్ , వివిధ డిపార్ట్మెంట్లో పని చేసేటటువంటి ఉద్యోగుల క్యాడర్ స్కీమ్ వంటి పలు అంశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంపై కార్మికులు అయోమయంలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఐ.ఎన్.టి.యు.సి యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక హక్కుల సాధనలో , కార్మికుల సంక్షేమం విషయంలో, నూతన హక్కుల విషయంలో ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన పోరాడుతుందని తెలియజేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!