భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చండ్రుగొండ రేంజ్,పోకలగూడెం, బీట్ బెండలపాడు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో గొత్తి కోయల చేత హత్య గావించబడ్డ చలమల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్ధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంచే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్ స్థాయి అధికారులు, సి సి ఎఫ్ స్థాయి అధికారులు, ఎఫ్ డి ఓ, ఖమ్మం, వరంగల్,మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నాలుగు జిల్లాల ఫారెస్ట్ అధికారులు,సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పాఠశాలల విద్యార్థులతో మండల రేంజ్ కార్యాలయం నుంచి ప్రభుత్వం చలమల శ్రీనివాసరావు గారు మృతి చెందిన ప్రదేశాన్ని స్మృతి వనంగా ప్రకటించగా అక్కడివరకు భారీ ర్యాలీ నిర్వహించి స్మృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు అనంతరం అధికారులతో కలిసి శ్రీనివాస రావు గారి స్మారక స్తూపాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించి మొక్కల వలన కలిగే ఉపయోగాలను వివరించి దివంగత ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాస రావు గారికి ఘన నివాళి అర్పించారు.

Loading

By admin

te Telugu
error: Content is protected !!