తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిద గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నామాల లక్ష్మణకుమార్ నిజాయతీని చాటుకున్నారు. ఈనెల 24న సీతానగరానికి చెందిన శ్రీలేఖ కుటుంబం ఆటోలో వెళ్తూ రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్ను పోగొట్టుకుంది. ఆ బ్యాగ్ దొరికిన లక్ష్మణకుమార్.. దానిని భద్రపరిచి శుక్రవారం పోలీసులకు అప్పగించారు. బ్యాగ్లోని ఆధార్ కార్డు వివరాల ఆధారంగా పోలీసులు బాధితురాలిని పిలిపించి నగలను అందజేశారు. లక్ష్మణకుమార్ అద్భుతమైన నిజాయతీని పోలీసులు, స్థానికులు ఎంతగానో అభినందించారు.
![]()



