యూడీఐడీ కార్డు దివ్యాంగుల గౌరవానికి ప్రతీకగా నిలిచే హక్కు పత్రమని మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం నిలోఫర్ ఆస్పత్రిలో యూడీఐడీ ఎవల్యూషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. వైకల్యాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ప్రభుత్వం రూ. 20 కోట్లతో ఆధునిక పరికరాలు కొనుగోలు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 రకాల వైకల్యాలను ధృవీకరిస్తూ ఇప్పటివరకు 74 వేల కార్డులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చిన్నతనంలోనే వైకల్యాన్ని గుర్తిస్తే థెరపీ ద్వారా నయం చేసే అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు.
![]()




