రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలను తెలంగాణ ప్రభుత్వం కొట్టిపారేసింది. చమురు, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రతిరోజూ 24,000 కిలోలీటర్ల చమురు, 2.22 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయని తెలిపింది. కృత్రిమ కొరత సృష్టించినా లేదా అధిక ధరలకు విక్రయించినా టోల్ ఫ్రీ నంబర్ 19672కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మరిన్ని వార్తల కోసం PRESS MEET APP ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.
![]()



