సింగరేణి సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మధ్య గురువారం హైదరాబాద్లో కీలక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల బీమా అందనుంది. ఇప్పటికే ప్రమాద బీమా కింద రూ.కోటి చెల్లిస్తుండగా, కొత్త ఒప్పందంతో కార్మిక కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. రూ.8,906 ప్రీమియంతో కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ ప్రకటించింది. దేశంలోనే ఇలాంటి బీమా పథకం అమలు కావడం గర్వకారణమని అధికారులు తెలిపారు.
![]()




