గోదావరిఖనిలో మైసమ్మ ఆలయాలను కూల్చిన చర్యపై బండి సంజయ్ ఆగ్రహం

గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చిన అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులను కూల్చనట్లయితే, ఆలయాలను మాత్రమే కూల్చడంలో తేడేంటి అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు, భక్తులు ప్రతిరోజూ ఆలయాలను దర్శించుకుంటున్నారని, భక్తుల మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. గోదావరిఖనికి 48 గంటల్లో ఆలోపు కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించమని హెచ్చరించారు, లేకపోతే మసీదులన్నిటినీ కూల్చే చర్య తీసుకుంటానని, అధికారులందరినీ ప్రజల ముందు నిలబెడతానని స్పష్టం చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!