Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Telangana

దళితుల రాజ్యాంగ హక్కుల సాధనకై “ఛలో ఢిల్లీ” : పిల్లి సుధాకర్‌

మహబూబాబాద్‌ జిల్లాలోని గాంధీపురం మున్సిపల్‌ పరిధిలో జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో జరగనున్న “ఛలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్‌ 26న ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం విస్తృత స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దళితుల హక్కులు, సమాన అవకాశాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి […]

Loading

హబూబాబాద్‌ జిల్లాలోని గాంధీపురం మున్సిపల్‌ పరిధిలో జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో జరగనున్న “ఛలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్‌ 26న ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం విస్తృత స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దళితుల హక్కులు, సమాన అవకాశాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొంటూ, దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సందర్భంలో మాలమహానాడు తరఫున పలు కీలక డిమాండ్లు ఉంచబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి — పార్లమెంట్‌కు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఇవ్వడం, మాల, మహార్‌ అనుబంధ కులాల అభివృద్ధికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పునర్మూల్యాంకనం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం ప్రవేశపెట్టి, రిజర్వేషన్ల శాతాన్ని 15 నుండి 20 శాతానికి పెంచడం ఉన్నాయి. అదేవిధంగా, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, న్యాయస్థానాలు, రాజ్యసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడం, విద్యార్థులకు భారత రాజ్యాంగాన్ని ప్రాంతీయ భాషల్లో అందించడం, కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ చిత్రాన్ని ముద్రించడం వంటి అంశాలు ఉన్నాయి.

లాగే బ్యాగరి, కాటికాపరులకు జాతీయ గుర్తింపు, గౌరవ వేతనం, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ సహకారం, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠికను ప్రతిరోజు ప్రార్థనలో చదివేలా చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. పిల్లి సుధాకర్‌ మాట్లాడుతూ, ఈ పోరాటం దళితుల హక్కులకే కాకుండా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండమల్ల జాని, పచ్చర్ల బన్ను, గాజుల చిన్ని, గోగు మహేష్‌, ఇర్రి నాగరాజు తదితర నేతలు పాల్గొన్నారు. చివరగా “జై మాల, జై భీమ్” నినాదాలతో సభ ముగిసింది.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!