తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ గురువారం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి, మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మేజిక్ ఫిగర్ 118 కాగా, ప్రస్తుతం 113 మంది మద్దతు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా నడుపుతారని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి స్పందనగా తాను బలపరీక్షకు సిద్ధమని విజయ్ స్పష్టం చేశారు. వీసీకే వంటి పార్టీలు విజయ్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా, అధికారిక మద్దతుపై ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు, విజయ్ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన సీఎం కాన్వాయ్ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. గవర్నర్ను కలిసేందుకు కూడా ఆయన తన సొంత వాహనంలోనే వెళ్లడం విశేషం. కాంగ్రెస్ మద్దతు లభించినా, మేజిక్ ఫిగర్ కోసం మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు అనివార్యమైంది. ఈ ఉత్కంఠ మధ్య గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
![]()




