గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో మద్యం విక్రయించి పెద్ద ఎత్తున మాఫియాకు తెరలేపారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగిన మద్యం, డ్రగ్స్ విక్రయాల వల్లే మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చంద్రబాబు సైతం మహిళలను పథకాల పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేశ్ నెరవేర్చారు. సీతానగరం మహానాడు వద్ద రూ. 294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కృష్ణా…
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం నెరబైలు అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురై రెండు ఏనుగులు మరణించాయి. అడవి పందుల నివారణకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది.…
పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం, కృష్ణవరం పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి కృష్ణవరంలో పులి ఆవు, దూడను చంపి తినడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలేరు జలాశయం…
బాధితురాలి సంచలన ఆరోపణలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను ఏడాదిన్నరగా వేధిస్తున్నారని, ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించారని ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం…
Leave a Reply