మే 2న దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లు ఒకేసారి సైరన్ శబ్దాలతో మారుమోగనున్నాయి. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే ‘సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్’ను పరీక్షించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ, ఎన్డీఎంఏ సంయుక్తంగా ఈ ట్రయల్ నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం ప్రయోగాత్మక పరీక్ష మాత్రమేనని, ఫోన్కు అలర్ట్ మెసేజ్ వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర సమాచారాన్ని క్షణాల్లో లక్షలాది మందికి చేరవేయడం సాధ్యమవుతుంది.
![]()




