దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందు వంటి సిరప్లను డాక్టర్ చీటీ లేకుండా కెమిస్ట్లు నేరుగా విక్రయించడాన్ని నిషేధించింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల ‘షెడ్యూల్ K’ నుండి సిరప్లను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దగ్గు మందుల నాణ్యత, భద్రతా లోపాలపై వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో, డీటీఏబీ (DTAB) సంప్రదింపులతో సిరప్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ తక్షణ నిర్ణయం తీసుకుంది.
![]()


