Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
National

లూజ్‌ ఫాస్టాగ్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ కఠిన చర్యలు – టోల్ గేట్ల వద్ద కొత్త మార్గదర్శకాలు

టోల్ గేట్ల వద్ద ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే అమలులో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కాకుండా, దానిలో కొంతమంది వాహనదారుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు జాతీయ రహదారుల సంస్థ (NHAI) తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ‘లూజ్‌ ఫాస్టాగ్‌’ (Loose FASTag) వినియోగం పై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లూజ్‌ ఫాస్టాగ్‌ అంటే ఏమిటి? […]

Loading

  • లూజ్ ఫాస్టాగ్‌లపై కేంద్రం సీరియస్‌
  • టోల్ గేట్ల వద్ద కఠిన చర్యలు,
  • కొత్త టోల్ పాస్ విధానం
  • ఆగస్టు 15 నుంచి అమల్లోకి

టోల్ గేట్ల వద్ద ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే అమలులో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కాకుండా, దానిలో కొంతమంది వాహనదారుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు జాతీయ రహదారుల సంస్థ (NHAI) తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ‘లూజ్‌ ఫాస్టాగ్‌’ (Loose FASTag) వినియోగం పై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

లూజ్‌ ఫాస్టాగ్‌ అంటే ఏమిటి?

సాధారణంగా, ఫాస్టాగ్ అనేది వాహన విండ్షీల్డ్‌పై అతికించబడిన ఓ ఎలక్ట్రానిక్ పాస్. ఇది టోల్ గేట్ల వద్ద స్కానర్ సెన్సర్‌ల ద్వారా స్కాన్ చేయబడి, స్వయంచాలకంగా టోల్ ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. అయితే, కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ఈ ట్యాగ్‌ను వాహనంపై అతికించకుండా, పర్సు లేదా డ్యాష్‌బోర్డ్‌లో ఉంచి టోల్ గేట్ వద్ద వచ్చినపుడు బయటకు తీసి చూపించటం ద్వారా వ్యవస్థను మోసం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి తతంగాలను ‘లూజ్ ఫాస్టాగ్’ అని పేర్కొంటున్నారు.

ట్రాఫిక్‌ సమస్య

ఎన్‌హెచ్‌ఏఐ తెలిపిన ప్రకారం, లూజ్ ఫాస్టాగ్ వినియోగం కారణంగా టోల్ ప్లాజాల వద్ద స్కానింగ్ సరిగ్గా జరగకపోవడంతో వాహనాల నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది కేవలం వ్యవస్థలో ఆలస్యం కలిగించడమే కాకుండా, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తోంది. అంతేకాక, కొంతమంది యూజర్లు ఈ విధానాన్ని తప్పుడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు కూడా అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

కఠిన చర్యలు – బ్లాక్‌లిస్ట్‌లోకి లూజ్ ఫాస్టాగ్ యూజర్లు

పరిస్థితులను నియంత్రించేందుకు NHAI కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై లూజ్ ఫాస్టాగ్ వినియోగదారుల వివరాలు సంబంధిత టోల్ కలెక్టింగ్ ఏజెన్సీలు తక్షణమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈమెయిల్ ఐడీకి పంపించాలని ఆదేశించింది. రిపోర్ట్‌లు సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించి తప్పుల వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే ప్రక్రియ ప్రారంభించనుంది. బ్లాక్‌లిస్ట్‌లో చేరినవారికి ఫాస్టాగ్ సేవలు నిలిపివేయడం లేదా జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

టోల్ చెల్లింపులో పారదర్శకతకు పునాది

ఫాస్టాగ్ విధానం వాహనదారులకు వేగవంతమైన ప్రయాణాన్ని కల్పించేలా రూపుదిద్దుకున్నప్పటికీ, కొన్ని మోసపూరిత చర్యల వల్ల దీనిపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ఈ చర్యలు చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రయాణికులు కూడా తమ వాహనాల్లో సరైన ఫాస్టాగ్ వాడకంతో ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

కొత్త టోల్ పాస్ విధానం – 3 వేల రూపాయల వార్షిక పాస్‌

ది వరకే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని, జాతీయ రహదారులు (NH) మరియు జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే (NE) పై ప్రయాణించే వ్యక్తిగత వాహనాల కోసం ప్రత్యేక టోల్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు రూ. 3,000 చెల్లించి ఫాస్టాగ్ టోల్ పాస్ పొందవచ్చు. ఇది వార్షిక చెల్లింపుతో పాటు 200 ట్రిప్పుల వరకూ ప్రయోజనాలను అందించనుంది.

ఆగస్టు 15 నుంచి అమల్లోకి

కొత్త విధానం 2025 ఆగస్టు 15 నుంచి అమలులోకి రానుంది. ఇది పూర్తిగా వ్యక్తిగత వాహనాలపై మాత్రమే వర్తించనుంది. వాణిజ్య వాహనాలు, బస్సులు, ట్రక్కులకు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. ఇది ప్రయాణాలను ముందస్తు చెల్లింపుతో నిర్విరామంగా చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడనుంది.

ప్రయోజనాలు మరియు ప్రభావం

చర్యల వల్ల ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా, ప్లాజాల వద్ద నిలిచే సమయం తగ్గుతుంది. టోల్ ప్లాజాల వద్ద మానవశక్తిపై ఆధారపడే వ్యవస్థకు భిన్నంగా, పూర్తిగా స్వయంచాలకంగా, పారదర్శకంగా టోల్ వసూలు చేయడం వల్ల అవినీతి అవకాశాలు తగ్గుతాయి. ఇకపోతే లూజ్ ఫాస్టాగ్ లను అరికట్టడం వల్ల స్కానింగ్ వ్యవస్థ మరింత వేగవంతంగా పని చేసి, మిగిలిన వాహనదారుల ప్రయాణాలను వేగవంతం చేస్తుంది.

మొత్తానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు కీలక నిర్ణయాలు – ఒకటి లూజ్ ఫాస్టాగ్‌లపై కఠిన చర్యలు, రెండు కొత్త వార్షిక టోల్ పాస్ విధానం – దేశవ్యాప్తంగా రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంలో పెద్దదైనా మెరుగుదలగా నిలిచే అవకాశం ఉంది. వాహనదారులు కూడా ఫాస్టాగ్‌లను సరైన విధంగా వాడుతూ, వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా సహకరిస్తే రహదారులపై ప్రయాణ అనుభవం మరింత వేగవంతంగా, హాసలుగా మారనుంది.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!