Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
నగరపాలక సంస్థ దిశగా కొత్తగూడెం - Press Meet

రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతానగర్ మండలాల్లోని 35 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.

విలీనమయ్యే పంచాయతీలు

చుంచుపల్లి మండలం: 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, బాబు క్యాంప్, చుంచుపల్లి (పిటి), ధన్‌బాద్, గౌతంపూర్, ఎన్‌కే.నగర్ (బదావత్ తండా), నంద తండా, పెనుబల్లి, ప్రశాంతినగర్, రామాంజనేయ కాలనీ, రుద్రంపూర్, వెంకటేశ్వర కాలనీ, విద్యానగర్ కాలనీ.

లక్ష్మీదేవిపల్లి మండలం: అశోక్‌నగర్ కాలనీ, చాటకొండ (ఆర్), హమాలీ కాలనీ, లక్ష్మీదేవిపల్లి, లోతువాగు, ప్రశాంత్‌నగర్, సంజయ్‌నగర్, సాతివారిగూడెం, శేషగిరినగర్, శ్రీనగర్ కాలనీ.

పాల్వంచ మండలం: బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవపురం, లక్ష్మీదేవిపల్లి (ఎస్).

సుజాతానగర్ మండలం: 2 ఇంక్లైన్ (హెడ్‌క్వార్టర్), కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నాయకులగూడెం, సుజాతానగర్.

ఈ చర్యల ద్వారా కొత్తగూడెం నగరపాలక సంస్థ పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.

Loading

By admin

te Telugu
error: Content is protected !!