Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Khammam

AMC కాలనీలో దళితుల డబుల్ బెడ్ రూమ్ సమస్యపై సమావేశం

AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే నిరుపేద దళితులు ఇప్పటికీ అర్హత కలిగినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనైనా ఆశలు […]

Loading

AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:
జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే నిరుపేద దళితులు ఇప్పటికీ అర్హత కలిగినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనైనా ఆశలు నెరవేరుతాయనే అనుకున్నా, ఇళ్ల పంపిణీలో అసమానతలు కొనసాగుతున్నాయన్నారు.

దినసరి కూలీల పరిస్థితి:
రోజువారీ కష్టం చేసుకునే వారు నెలకు ₹3000-₹4000 అద్దె కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న దళితులకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా అందలేదని చెప్పారు. దళితుల హక్కులను కాపాడేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి డిమాండ్:
ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా పరిగణించి, అర్హులైన నిరుపేద దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించాల్సిన బాధ్యతను నెరవేర్చాలని జయరాజు అన్నారు.

సమావేశంలో పాల్గొన్నవారు:

ఈ కార్యక్రమంలో శాంతి రాజు, చీకటి దశమ్ బాబు, రాజు, బర్ల రామకృష్ణ, దాసరి సామేలు, కొంగ దిలీపు, కొంగ సాగర్, కనకయ్య, యేసు, వినయ్, బన్నీ, వంశీ, రాకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దళితుల హక్కుల కోసం వారి సమర్థంగా పోరాడతామని వారు మద్దతు తెలిపారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!