📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,039,972  |  417 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Khammam ⚡ AMP

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ జితేష్

November 13, 2024 November 13, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్యుల అర్హతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే అర్హతలకు మించి వైద్యం చేస్తున్న వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు ఆసుపత్రులలో పనిచేసే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు అవసరమని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తక్షణం తరలించి వైద్యం అందించాలని, ప్రమాదకర ప్రాంతాల జియో ట్యాగింగ్ చేయాలని కోరారు. డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా వైద్య అధికారి, రక్త పరీక్ష కేంద్రాల్లో పరీక్షల ధరల వివరాలను ప్రజలకు తెలిసేలా ఆసుపత్రులలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు అరికల భాస్కర్, అనుమతులు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డా. మధువరన్, డిప్యూటీ DMHO ఫైజ్ మొహియుద్దీన్, ఉమా మహేశ్వరి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!