Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Khammam

సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు: హక్కులు, సేవలపై అవగాహన సదస్సు

ఈరోజు 28-09-2024 శనివారం ఉదయం 10:30 గం:లకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనం, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం లో జిల్లా మహిళా,శిశు,దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు 25-09-2024 నుండి 01-10-2024 సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ తరపున శ్రీ నరేష్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ హక్కులు వివరించారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తే సంక్షేమశాఖ […]

Loading

ఈరోజు 28-09-2024 శనివారం ఉదయం 10:30 గం:లకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనం, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం లో జిల్లా మహిళా,శిశు,దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు 25-09-2024 నుండి 01-10-2024 సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ తరపున శ్రీ నరేష్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ హక్కులు వివరించారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తే సంక్షేమశాఖ దృష్టి కి తీసుకొని రావాలి అని వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన అన్ని హక్కులు, వైద్య సేవలు అందించే లా సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు.

సెక్రటరీ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు బ్యాంకుల వద్ద హాస్పిటల్ లలో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు . సభ్యులు శ్రీ Dr శ్రీ బత్తుల కృష్ణయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ శారీరక, మానసిక ఒత్తిడి కి గురి కాకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు, రిటైర్ ప్రిన్సిపాల్ శ్రీ ప్రసన్న కుమార్ గారు సీనియర్ సిటిజన్స్ కూడా ప్రతి సంవత్సరం ఇన్ కం టాక్స్ పరిధి లో ఉన్న లేకున్నా సబ్మిట్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్ ITI ప్రిన్సిపాల్ శ్రీ సందీప్, శ్రీ నరసింహారావు, సాహితీ,సీనియర్ సిటిజన్స్ సభ్యులు శ్రీ పాండురంగారావు, శివ రామక్రిష్ణ,కామేశ్వరరావు, మైనేని నాగేశ్వరరావు, గురుమూర్తి, రాజేంద్రప్రసాద్,కేశవరావు, ధర్మారావు, మోహన్ లాల్,విజయ మోహన్, నసీరుల్లా RP జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!