దేశంలో చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహాన్ని అరికట్టేందుకు కేంద్రం ‘ఆర్బీఎస్కే 2.0’ పేరిట నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ బృందాలు పాఠశాలలు, అంగన్వాడీల్లో చిన్నారులకు విస్తృతంగా మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాయి. వ్యాధి గుర్తిస్తే జిల్లా స్థాయిలో ఉచిత చికిత్స, మందులు అందిస్తారు. టైప్-1తో పాటు ప్రమాదకరమైన పీడియాట్రిక్ టైప్-2 డయాబెటిస్పై అవగాహన కల్పిస్తూ, రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో ప్రత్యేక చికిత్సలు ప్రారంభించనున్నారు. జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
![]()




