విజయవాడలో కొత్తగా మంజూరైన ఐదు అదనపు సివిల్ జడ్జి కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రారంభించారు. న్యాయస్థానాల సంఖ్య పెరగడం వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 90 కోర్టులను మంజూరు చేయగా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు 10 కేటాయించినట్లు తెలిపారు. కేసుల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని కోర్టుల ప్రాంగణంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.
![]()




