అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్ల అప్పులు చేయడం ఆర్థిక ఆత్మహత్యతో సమానమని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీ తరహాలో రాజధానిని దశలవారీగా అభివృద్ధి చేయాలని, భారీ అంచనాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టవద్దని కూటమి ప్రభుత్వానికి సూచించారు. మావిగన్ (MAVIGAN) ప్రతిపాదన పాలనను విచ్ఛిన్నం చేస్తుందని, ఇది పెట్టుబడిదారుల్లో అనిశ్చితికి దారితీస్తుందని విమర్శించారు. ఆకాశహర్మ్యాల కంటే ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
![]()




