హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ కీలక ముందడుగు వేసింది. రూ. 55 కోట్ల నిధుల మళ్లింపు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై కేటీఆర్ను ఏ1గా పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐఏఎస్ అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా ఐదుగురిని నిందితులుగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లించి, ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందారనే అభియోగాలు మోపారు. నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర ఈ కేసులో ప్రధానాంశాలుగా పేర్కొంటూ దర్యాప్తు ముగించారు.
![]()




