ఇజ్రాయెల్లోని డిమోనా అణు పరిశోధన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. నతాంజ్ అణు కేంద్రంపై దాడికి ప్రతీకారంగా జరిగిన ఈ ఘటనలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో క్షిపణులు నివాస ప్రాంతాలపై పడ్డాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా గాయపడగా, అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. దీనిని తీవ్రంగా ఖండించిన ప్రధాని నెతన్యాహు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్కు ట్రంప్ 48 గంటల అల్టిమేటం జారీ చేయడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచింది.
![]()




