ఖతార్లో ఆదివారం జరిగిన ఘోర మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. సముద్ర తీరంలో సాధారణ గస్తీ నిర్వహిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం కూలిపోయిందని అంతర్గత వ్యవహారాల శాఖ ధృవీకరించింది. విమానంలోని ఏడుగురిలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, గల్లంతైన మరొకరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రాంతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఈ ఘటన కలకలం రేపినప్పటికీ, ఇది పూర్తిగా యాంత్రిక వైఫల్యమేనని అధికారులు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాల్లో ఈ విషాదం తీవ్ర శోకాన్ని నింపింది.
![]()




