ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని, అసలైన లబ్ధిదారులను గుర్తించి అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. కేవలం 311 మందికే కాకుండా బాధితులందరికీ ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేస్తూ, భూదాన్ భూములపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి చర్యలను నిలిపివేసింది.
![]()




