కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన ఈ మాదకద్రవ్యాలను సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరో ఘటనలో, ముషీరాబాద్లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ప్రదీప్, విజయ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 367 గ్రాముల హాష్ ఆయిల్, బైక్ మరియు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు చేపడుతున్న తనిఖీల్లో భాగంగా ఈ ముఠాల గుట్టు రట్టయింది.
![]()

Leave a Reply