మహిళలు ఆన్లైన్లో సురక్షితంగా ఉండాలని, సైబర్ బ్లాక్ మెయిలింగ్కు భయపడవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోల పేరుతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే పంపవద్దని, ఒక్కసారి పంపితే పదే పదే వేధిస్తారని హెచ్చరించారు. ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉండకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ధైర్యంగా ఉండి అవగాహనతోనే ఇటువంటి నేరాలను అరికట్టవచ్చని మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు.
![]()

Leave a Reply