📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,533,780  |  695 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Warangal ⚡ AMP

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం

October 3, 2024 October 3, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో కాజిపేట ELS రైల్వే కాలనీ కూడలిలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 120 వ,, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది,
ముందుగా వారి విగ్రహానికి పూలమాలవేసి వారి పాదాలచెంత విడిపూలను సమర్పించిన వారి జయంతి ని పురస్కరించుకొని వక్తలు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ ప్రధమ రైల్వే శాఖమంత్రిగా ఉన్న ఒకానొక సమయంలో రైలు ప్రమాదం జరిగినపుడు వారు రైల్వే మంత్రిత్వశాఖకు బాధ్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామ చేసారని…! భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఆహరకొరత ఏర్పడినపుడు ఇతర దేశాలలో నుండి ఆహారదాన్యాలను దిగుమతి చేసి దేశ ప్రజలకు ఆహారాన్ని అందించడమే కాక దేశానికి వెన్నముఖ రైతేనని దేశ రక్షణకు జవాన్ కాపలా ఉంటే… దేశ ప్రజలకు కడుపునింపేవాడు కిసాన్ అని జై జవాన్…! జై కిసాన్…!! నినాదం ఇచ్చారాని…

ఇతరదేశాలు భారతదేశానికి ఒక పొట్టివాడు చేతకాని ప్రధానిని ఎన్నుకున్నారని హేళన చేసినా వారు దానిని చిరున్నావ్వుతో సమాధానం ఇచ్చి పాకిస్తాన్ తో యుద్ధం వస్తే కాశ్మీర్ బాడర్లో మీలాటరీ టెంట్ల కింద ఉంది యుద్ధం పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండి మనదేశ మీలాటరీ సైన్యానికి దైర్యం గా నిలబడి యుద్ధంలో గెలిచి పొట్టివాన్ని కాదు గట్టివాన్ని అని సరైన సమాధానం ఇచ్చిన మహానుభావుడు అని భారతదేశానికి ప్రధాన మంత్రి గా చేసినప్పటికి… ఒక స్వంత ఇళ్ళుకూడ లేని నిజాతి పరుడని అలాంటి నిజాయితీ పరులగురించి ఈ తరాలకు తెలియచేయాలనీ వారి మార్గంలో అందరూ నడవాళని అన్నారు, ఈ కార్యక్రమం లో తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC కన్వీనర్ : దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ : కోండ్ర నర్సింఘారావు, రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ : గుర్రపు సుధాకర్, M.K. మూర్తి, A. శ్రీనివాస్,వి. నాగేష్, P.రవీందర్, వి. తిరుపతి, D. రవీందర్, P. రమేష్, ఎప్నేజర్, G. రాజలింగం, T. సారయ్య, B. శివ, కరుణాకరా చారీ, నాగపూరి రాజయ్య, D. వెంకట్, అమరనాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!