వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం పోలీస్ అధికారుల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నివారణకు అన్ని సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం […]
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం పోలీస్ అధికారుల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నివారణకు అన్ని సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పోలీసుల ముఖ్య లక్ష్యమని కమిషనర్ వివరించారు.
Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play