📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,537,136  |  115 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam ⚡ AMP

సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు: హక్కులు, సేవలపై అవగాహన సదస్సు

September 28, 2024 September 28, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఈరోజు 28-09-2024 శనివారం ఉదయం 10:30 గం:లకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనం, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం లో జిల్లా మహిళా,శిశు,దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు 25-09-2024 నుండి 01-10-2024 సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ తరపున శ్రీ నరేష్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ హక్కులు వివరించారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తే సంక్షేమశాఖ దృష్టి కి తీసుకొని రావాలి అని వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన అన్ని హక్కులు, వైద్య సేవలు అందించే లా సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు.

సెక్రటరీ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు బ్యాంకుల వద్ద హాస్పిటల్ లలో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు . సభ్యులు శ్రీ Dr శ్రీ బత్తుల కృష్ణయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ శారీరక, మానసిక ఒత్తిడి కి గురి కాకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు, రిటైర్ ప్రిన్సిపాల్ శ్రీ ప్రసన్న కుమార్ గారు సీనియర్ సిటిజన్స్ కూడా ప్రతి సంవత్సరం ఇన్ కం టాక్స్ పరిధి లో ఉన్న లేకున్నా సబ్మిట్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్ ITI ప్రిన్సిపాల్ శ్రీ సందీప్, శ్రీ నరసింహారావు, సాహితీ,సీనియర్ సిటిజన్స్ సభ్యులు శ్రీ పాండురంగారావు, శివ రామక్రిష్ణ,కామేశ్వరరావు, మైనేని నాగేశ్వరరావు, గురుమూర్తి, రాజేంద్రప్రసాద్,కేశవరావు, ధర్మారావు, మోహన్ లాల్,విజయ మోహన్, నసీరుల్లా RP జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!