📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,178  |  767 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hyderabad ⚡ AMP

రంగారెడ్డి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

September 10, 2024 September 10, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళ వారం నాడు ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మొకిల్ల లొ.. నిరుపయోగంగా ఉన్న ఓ పశువుల కొట్టంలో పెద్ద ఎత్తున అక్రమంగా దాచి ఉంచిన రేషన్ బియ్యంను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నగర శివార్ల నుంచి రేషన్ బియ్యంను అక్రమంగా అధిక ధరకు సేకరించి పొరుగు జిల్లాలకు, ఆ తర్వాత పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశామన్నారు. నగర శివార్లలో నిర్మానుష్య ప్రాంతాలను అక్రమార్కులు ఎంచుకుని పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వ స్థావరాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.ఈ దాడుల్లో పౌర సరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందంతో పాటు డిటీ హనుమా రవీందర్ నాయక్ స్వాదీనం చేసుకున్న సరకు పంచనామ చేశారు. వాహనాలను మోకిల పోలీసుల అదుపులో ఉంచారు. సరకును సురక్షిత నిల్వ నిమిత్తం చేవెళ్ళ పౌర సరఫరాల సంస్థ గిడ్డంగికి అప్పగించినట్లు మాచన రఘునందన్ వివారించారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!