📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,481  |  744 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
National ⚡ AMP

అనాధ పిల్లల దత్తత ఇక సులభతరమ్ ‘ఆదర్శ ఫాస్టర్‌కేర్‌ 2024’ పెరిట నిబంధనలు రూపొందించిన కేంద్రం

July 6, 2024 July 6, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రాష్ట్రంలో ఆరేళ్లు నిండిన అనాథలు, వదిలేసిన పిల్లల దత్తతకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దత్తత కోసం ఎంపిక చేయని ఆరేళ్లలోపు పిల్లలను ఆదర్శ ఫాస్టర్‌కేర్‌ లో ఉంచుతారు. వారు సంరక్షణ కేంద్రాల నుండి బయటపడటానికి మరియు ఇంటి వాతావరణంలో వృద్ధి చెందడానికి కొత్త మార్గదర్శకాలు అందుబాటులో ఉన్నాయి. పెంపుడు సంరక్షణలో రెండు సంవత్సరాల తర్వాత, ఒక బిడ్డ దత్తత తీసుకోవడానికి అర్హులుగా ప్రకటించబడింది. రెండేళ్లుగాఫాస్టర్‌కేర్‌లో ఉన్న కుటుంబాలు మరియు దంపతులు ముందుకు వస్తే బిడ్డను దత్తత తీసుకునేందుకు వీలుగా ‘ఆదర్శ ఫాస్టర్‌కేర్‌ నిబంధనలు-2024’ రూపొందించిం కేంద్రం’ రూపొందించబడింది. కొత్త నిబంధనల గురించి ప్రజలకు పూర్తిగా తెలియజేయడం అవసరం. ఈ విషయమై మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి త్రిపాఠి గృహ ప్రతి రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖలకు లేఖ రాసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి రాష్ట్రం ఆరు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల సంరక్షణను కోరుకునే జంటలు మరియు కుటుంబాలను నమోదు చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.తాత్కాలిక, శాశ్వత సంరక్షణను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.

ఇవీ నిబంధనలు…

  • ఫాస్టర్‌కేర్‌ కోసం ముందుకు వచ్చే దంపతులు, కుటుంబాలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అర్హులై ఉండాలి. ఆరేళ్ల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులను సంరక్షణలోకి తీసుకోవాలనుకున్న దంపతులిద్దరి వయసు కలిపితే 70 ఏళ్ల నుంచి 110 ఏళ్ల మధ్య ఉండాలి. సింగిల్‌ పేరెంట్‌ అయితే 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 12 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్నా ఇవే వయో నిబంధనలు వర్తిస్తాయి. సింగిల్‌ పేరెంట్‌ పురుషుడు ఉంటే ఆడపిల్లను తాత్కాలిక సంరక్షణకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరు.
  • తాత్కాలిక సంరక్షణకు ముందుకు వచ్చిన దంపతులు నిబంధనల ప్రకారం అన్ని వివరాలతో రిజిస్టరు చేసుకోవాలి. వారి వివరాలు బాలల సంరక్షణ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు పరిశీలించి సంరక్షణకు అనుమతిస్తారు. తాత్కాలిక సంరక్షణ సమయంలో పిల్లలపై వివక్ష చూపినా, సంరక్షణ సరిగా లేకున్నా ఆ సంరక్షణను రద్దుచేస్తారు. 
  • కుటుంబం లేదా దంపతులు ఇద్దరు పిల్లలను తాత్కాలిక సంరక్షణ కింద తీసుకోవచ్చు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబం పరిధిలో ఉండాలి. సంరక్షణ కుటుంబంలోని సొంత పిల్లలతో కలిపి మొత్తం పిల్లల సంఖ్య నలుగురికి మించి ఉండకూడదు. 
  • ఫాస్టర్‌ కేర్‌ కింద పిల్లలను తొలుత ఏడాది కాలానికి సంరక్షణలో పెడతారు. ఆ తరువాత చిన్నారుల బాగోగులు పర్యవేక్షిస్తూ, తాత్కాలిక సంరక్షణ దంపతుల వివరాలు సమీక్షించి ఏటా సంరక్షణ బాధ్యతను పెంచుతూ 18 ఏళ్ల వరకు పొడిగిస్తారు. ఒకవేళ రెండేళ్ల తరువాత దంపతులు ముందుకు వస్తే, పిల్లలు అంగీకరిస్తే శాశ్వత దత్తత ఇస్తారు. 
  • తాత్కాలిక సంరక్షణ పూర్తయిన తరువాత శాశ్వత దత్తత కోరుకుంటే.. కేంద్రీయ దత్తత నిబంధనల ప్రకారం పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తరువాత నివేదికలన్నీ సక్రమంగా ఉంటే ఆ పిల్లలను శాశ్వత దత్తతకు అనుమతిస్తారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!