అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో జరిగినట్లు చెప్తున్న ఆర్థిక అక్రమాలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలన్న పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. దీనిని అర్జంట్ లిస్టింగ్లో చేర్చాలన్న న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. నిధుల వినియోగం, భూముల కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని దాఖలైన ఈ పిటిషన్ను జూన్ 29న మరోసారి ప్రస్తావించాలని (మెన్షన్) ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ హైప్రొఫైల్ కేసుపై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
![]()



