అంతర్జాతీయ యుద్ధ పరిణామాల ప్రభావం భారతీయుల వంటింటిపై పడింది. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల రవాణా ఖర్చులు పెరగడంతో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల రోజుల్లోనే కిలో నూనె ధర 22 శాతం పెరిగింది. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 200లకు చేరగా, పామాయిల్ రూ. 145కు పెరిగింది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను నియంత్రించాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ ధరలతో పాటు నూనె ధరలు పెరగడం పెను భారంగా మారింది.
![]()




