Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Uncategorized

ప్రభుత్వ గురుకులాలా? ప్రాణాలు తీసే సంస్థలా?: మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొనసాగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అనారోగ్యాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పాఠశాలలు ప్రాణాలు తీసే విషవలయాలా?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. వాంకిడి ఘ‌ట‌న:ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థిని గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. […]

Loading

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొనసాగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అనారోగ్యాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పాఠశాలలు ప్రాణాలు తీసే విషవలయాలా?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

వాంకిడి ఘ‌ట‌న:
ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థిని గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ ఘటన విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

నారాయణపేట ప్రమాదం:
నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 50 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. వీరి ఆరోగ్య పరిస్థితి భయానకంగా మారిందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇతర సంఘటనలు:
నల్గొండ జిల్లాలో పాముకాటుకు గురైన ఓ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆయన వివరించారు. విద్యార్థుల ప్రాణాలకు నష్టమయ్యే పరిస్థితి ఎందుకు కొనసాగుతుందని ప్రశ్నించారు.

సర్కార్‌పై విమర్శలు:
గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడం కాదు, ప్రాణాలతో బయటపడితే చాలని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలు జరుపుకోవడం మరింత బాధాకరమని విమర్శించారు.

పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి:
ఆసుపత్రి పాలైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే, పాఠశాలల్లో ఆరోగ్య సదుపాయాలు, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. “ఇలాంటి నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలి?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనలు విద్యావ్యవస్థలో సమూల మార్పుల అవసరాన్ని స్పష్టం చేస్తూ, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని హరీశ్ రావు కోరారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!