📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 487,700  |  580 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Hyderabad ⚡ AMP

ఇల్లు లేని నిరుపేదలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త

July 1, 2024 July 1, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఇల్లు లేని నిరుపేదలకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలో అర్హులైన అభ్యర్థులందరికీ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. సోమవారం మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-2025 బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గట్టి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఎన్నికల నిబంధనల వల్లే ఇందిరమ్మ ఇంటి పథకం అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!