ఉత్తర్ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్ర రవాణా బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ‘లోకమాత అహిల్యాభాయి మాతృశక్తి యోజన’కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆధార్ లేదా ఓటర్ ఐడీ చూపించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. సుమారు కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుండగా, ప్రభుత్వం నెలకు రూ.22.50 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
![]()




