ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం యాప్ సేవలపై నెలకొన్న సందిగ్ధతకు సంస్థ అధికారికంగా తెరదించింది. పేటీఎం యాప్, యూపీఐ, వాలెట్, బిల్లు చెల్లింపులు మరియు టికెట్ బుకింగ్ వంటి సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. వాలెట్లలోని బ్యాలెన్స్ సురక్షితంగా ఉంటుందని, ఇతర బ్యాంకులతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మాత్రమే పరిమితులు వర్తిస్తాయని పేర్కొంది. వినియోగదారులు ఎప్పటిలాగే లావాదేవీలు చేసుకోవచ్చని సీఈఓ విజయ్ శేఖర్ శర్మ భరోసా ఇచ్చారు.
![]()




